I am Hazarath, Telugu Lead on LatestLY Telugu. I have been part of the journalism and digital industry for 10 years, with previous work experience for One India and 99tv and Surya and ATV. Writing my Hobby and Reporting my passion.
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని IMD అంచనా వేయడంతో, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారం రాష్ట్రంలో ఎలాంటి వేసవి తుఫానును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులను కోరారు
ఆగ్నేయ బంగాళాఖాతంలో మే 6న వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది
మాజీ మంత్రి, ఒంగోలు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. గత కొంతకాలంగా బాలినేని అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో బాలినేనితో సీఎం జగన్ బుజ్జగింపు ధోరణితో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో ఎండకాలంలోనే అకాల వర్షాలు భారీగా కురుస్తున్నాయి. పశ్చిమ విదర్భ నుంచి మరాఠ్వాడా, ఉత్తర కర్ణాటక, దక్షిణ కర్ణాటక వరకు సగటు సముద్రమట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి అనిశ్చితి కొనసాగుతున్నదని హైదరాబాద్ కేంద్రం తెలిపింది
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్(ICC Test rankings)లో టీమిండియా జట్టు టాప్ ప్లేస్’లోకి వచ్చేసింది. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టేసి .. రోహిత్ శర్మ సేన వార్షిక ర్యాంకింగ్స్లో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నది.
ఆస్ట్రేలియన్ ఇ-బైక్ స్టార్టప్ జూమో కంపెనీలో 16% ఉద్యోగాలను తగ్గించిన ఆరు నెలల తర్వాత తన గ్లోబల్ వర్క్ఫోర్స్ను అదనంగా 8% తగ్గించుకుంటున్నట్లు ప్రకటించింది.జూమో కిరాణా డెలివరీ మార్కెట్కు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఇ-బైక్లను సరఫరా చేస్తుంది, ఉబెర్ ఈట్స్, డొమినోస్, డిహెచ్ఎల్లు దాని ప్రముఖ కస్టమర్లు
ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి సునంద తెలిపారు. పశ్చిమ విదర్భ నుంచి కర్ణాటక వరకు ద్రోణి ప్రభావం కొనసాగుతోందని..దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలతో పాటు, కొన్ని చోట్లు భారీ వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ వెల్లడించింది
స్త్రీల శరీరాలు ఎంతో విలువైనవని, వాటిని వారు దుస్తులతో ఎంత ఎక్కువగా కప్పితే అంత మంచిదని ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్ వ్యాఖ్యానించారు. ఆదివారం రాత్రి ప్రసారమైన ‘ఆప్ కీ అదాలత్’ టీవీ కార్యక్రమంలో సల్మాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఢీ షో కొరియోగ్రాఫర్ చావా చైతన్య(32) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు సెల్పీ వీడియో తీసుకున్నారు. అందులో ‘అమ్మా నాన్న.. చెల్లీ.. నన్ను క్షమించండి.. కొరియోగ్రాఫర్లూ.. మిమ్మల్ని హర్ట్ చేస్తున్నాను.. అప్పులు ఎక్కువయ్యాయి. చెల్లించలేక ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి బాలుడు మృతిచెందాడు. కాకినాడకు చెందిన భీమ్శంకర్ తన భార్య పిల్లలతో కలిసి జూబ్లీహిల్స్లోని ఓ బైక్షోరూంలో వాచ్మన్గా పనిచేస్తున్నారు. షోరూం ప్రాంగణంలోనే ఓ గదిలో అతడి కుటుంబం నివాసముంటోంది.
వయాగ్రా వాడకాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో యువత లైంగిక ఆనందాన్ని పొందేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. ఈక్రమంలో ఉడుము కొవ్వుతో చేసిన నూనెను ఉపయోగించడం వల్ల లైంగిక పనితీరు పెరుగుతుందని బలంగా నమ్ముతారు.
స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనతను సాధించాడు. T20 క్రికెట్లో 300 వికెట్లు తీసిన రెండో ఇండియన్ బౌలర్గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున రెండు వికెట్లు పడగొట్టడం ద్వారా అశ్విన్ ఈ ఘనత సాధించాడు.
ఐపీఎల్-2023లో లక్నో సూపర్ జెయింట్స్ ఆల్రౌండర్ దీపక్ హుడా పేలవ ఫామ్పై అభిమానులు మండిపడుతున్నారు. లక్నోలోని ఎకానా స్టేడియంయ వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో దీపక్ హుడా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు.
రాజకీయ కురువృద్ధుడు, మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే మంగళవారం ప్రకటించారు.
రాజస్థాన్ ఉదయ్పూర్లో ఓ ఇంటి యజమాని అమ్మాయిలకు రెంట్ ఇచ్చిన ఫ్లాట్లో వాళ్లకు తెలియకుండానే రహస్యంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. బెడ్రూం, బాత్రూంలో స్పై కెమెరాలు పెట్టి తరచూ వాళ్ల అశ్లీల దృశ్యాలను వీక్షించాడు.
దేశ రాజధానిలోని జంతర్మంతర్ వద్ద ఆందోళన చేపట్టిన రెజ్లర్లను అవమానిస్తూ బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘వెయ్యిమంది మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించానని కొంతమంది ఆరోపించారు.
భారతదేశంలో ప్రతి సంవత్సరం వేలాది డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి మరియు వైరస్ కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బృందం చేసిన కొత్త మల్టీ డైమెన్షనల్ అధ్యయనం వైరస్ గురించి కొన్ని కొత్త వివరాలను వెల్లడించింది.
వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express Train)పై వరుస రాళ్ల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా కేరళ (Kerala)లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. సోమవారం తిరునావయ-తిరూర్ మధ్య గుర్తుతెలియని దుండగులు రాళ్లు రువ్వారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నట్లు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్రెడ్డికి మెయిల్ రావడంతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. పోలీసులు తిరుమలలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి తనిఖీలు చేపట్టారు.
రజనీకాంత్ అభిమానులు మండిపడుతున్నారు. ఈనేపథ్యంలో వైసీపీ నేతలు తమ అభిమాన హీరోకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రజనీకాంత్ను విమర్శించిన వారిపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ట్విటర్లో #YSRCPApologizeRajini అనే హ్యాష్ ట్యాగ్ బాగా ట్రెండ్ అవుతోంది.