Allu Arjun Case Row: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ.. బన్నీ హాజరు అవుతారా?
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు సంబంధించిన బెయిల్ పిటిషన్ పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనున్నది. బన్నీ బెయిల్ పిటిషన్ పై నేడు పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది.
Hyderabad, Dec 30: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ (Allu Arjun) కు సంబంధించిన బెయిల్ పిటిషన్ (Bail Petition) పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనున్నది. బన్నీ బెయిల్ పిటిషన్ పై నేడు పోలీసులు కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఉంది. హైకోర్టు మధ్యంతర బెయిల్ తో ప్రస్తుతం అల్లు అర్జున్ బయటే ఉన్నారు. గతంలో కోర్టు విధించిన 14 రోజుల రిమాండ్ ముగియడంతో కోర్టులో ఇటీవలే అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యారు. ఆ విచారణలో కౌంటర్ కి పోలీసులు సమయం కోరారు. ఈ క్రమంలో కేసు విచారణ నేటికి వాయిదా పడింది. కాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై విచారణ జనవరి 10కి వాయిదా పడిన విషయం తెలిసిందే.
మకరజ్యోతి పండుగ సందర్భంగా నేడు తిరిగి తెరుచుకోనున్న శబరిమల ఆలయం
బన్నీ వస్తారా?
గత విచారణకు అల్లు అర్జున్ కోర్టుకు వర్చువల్ గా హాజరయ్యారు. అయితే, నేటి విచారణకు ఆయన హాజరు అవుతారా? లేదా ఆయన లాయర్లు మాత్రమే హాజరవుతారా? అనేది తెలియాల్సి ఉంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)