కరోనా బూస్టర్ డోసులపై కేంద్రం శుభవార్త చెప్పింది. 18 ఏళ్లు పైబడిన వారందరికీ 75 రోజుల పాటు ఉచితంగా బూస్టర్ డోస్‌లు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. జూలై 15వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కోవిడ్ బూస్టర్ డోస్‌లు వేయించుకోవచ్చని తెలిపింది. దేశ 75వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకొంటున్న తరుణాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) బుధవారంనాడు తెలిపారు. ఈనెల 15 నుంచి రాబోయే 75 రోజుల పాటు 18 ఏళ్లు పైబడిన పౌరులందరూ ఉచితంగా బూస్టర్ డోస్ తీసుకోవచ్చని మంత్రి చెప్పారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)