Guillain-Barre Syndrome Syndrome: మహారాష్ట్రని వణికిస్తున్న జీబీఎస్ సిండ్రోమ్, ముంబైలో తొలి మరణం, రాష్ట్రంలో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య, గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు ఇవే..
మంగళవారం ముంబైలోని ఒక ఆసుపత్రిలో 53 ఏళ్ల వ్యక్తి గులియన్ బారే సిండ్రోమ్(GBS) కారణంగా మరణించాడు, ఇది నగరంలో ఈ అరుదైన నరాల రుగ్మత కారణంగా జరిగిన మొదటి మరణం. దీనితో, మహారాష్ట్రలో GBS కారణంగా మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి పెరిగింది
Mumbai, Feb 12: మంగళవారం ముంబైలోని ఒక ఆసుపత్రిలో 53 ఏళ్ల వ్యక్తి గులియన్ బారే సిండ్రోమ్(GBS) కారణంగా మరణించాడు, ఇది నగరంలో ఈ అరుదైన నరాల రుగ్మత కారణంగా జరిగిన మొదటి మరణం. దీనితో, మహారాష్ట్రలో GBS కారణంగా మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి పెరిగింది.మహారాష్ట్ర (Maharashtra)లో గులియన్ బారే సిండ్రోమ్ (Guillain Barre Syndrome) కేసులు తాజాగా 172కు చేరుకున్నాయి.
వడాలా ప్రాంతానికి చెందిన 53 ఏళ్ల వ్యక్తి కాళ్లలో బలహీనతతో జనవరి 23న నాయర్ ఆసుపత్రిలో చేరాడు. అతను ఒక ఆసుపత్రిలో వార్డ్ బాయ్గా పనిచేస్తున్నాడు మరియు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)కి మార్చబడ్డాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ఆ వ్యక్తిని వెంటిలేటర్పై ఉంచినట్లు నివేదికలు తెలిపాయి.GBS ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, అతను నాయర్ ఆసుపత్రిలో తగిన చికిత్స పొందాడు కానీ ఫిబ్రవరి 11న మరణించాడు. ఫిబ్రవరి 7న అంధేరీ (తూర్పు) నివాసి అయిన 64 ఏళ్ల మహిళకు నరాల రుగ్మత ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత ముంబైలో మొదటి GBS కేసు నమోదైంది.
గుండె పోటు వచ్చే ఛాన్స్ ను ముందుగానే చెప్పేసే ఈ ఐదు సంకేతాలు తెలుసా?
నేడు రాష్ట్రంలో ఐదు కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో నిన్నటి వరకూ 167గా ఉన్న జీబీఎస్ కేసులు తాజా కేసులతో 172కి పెరిగాయి. మహారాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ప్రకారం.. 172 కేసుల్లో.. పూణే మున్సిపల్ కార్పొరేషన్ (PMC) పరిధిలో 40, ఇతర గ్రామాల నుంచి 92, పింప్రి చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ (PCMC) నుంచి 29, పూణే రూరల్ ఏరియాలో 28, ఇతర జిల్లాల నుంచి 8 కేసులు రికార్డయ్యాయి. ఇప్పటి వకూ 104 మంది రోగులు ఆసుపత్రి నుంచి డిశ్యార్జ్ అయ్యారు. ప్రస్తుతం 50 మంది రోగులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. ఇంకో 20 మంది వెంటిలేటర్లపై ఉన్నట్లు అధికారులు తెలిపారు.
జీబీఎస్ అంటే ఏమిటి..? జీబీఎస్ అంటే గులియన్ బారే సిండ్రోమ్. ఇది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ (ఒక వ్యక్తిలోని రోగనిరోధక వ్యవస్థ తనలోని ఆరోగ్య కణాలనే శత్రువులుగా భావించి దాడి చేయడం) సిండ్రోమ్. ఈ సిండ్రోమ్ బారినపడిన వ్యక్తిలో ఉన్న రోగనిరోధక వ్యవస్థ అతని నాడీ వ్యవస్థపైనే దాడి చేస్తుంది. అందుకే దీన్ని ఆటో ఇమ్యూన్ సిండ్రోమ్ అని అంటారు. ఈ సిండ్రోమ్ వల్ల బాధితుడిలోని నరాలు, కండరాలు బలహీనంగా మారుతాయి. వివిధ రకాల వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకిన వారు.. అలాంటి సమయంలో ఈ గులియన్ బారే సిండ్రోమ్ బారిన పడే ప్రమాదం కూడా ఉంది.
ఈ వ్యాధి బారినపడిన వ్యక్తిలో నాడీ వ్యవస్థపై అతనిలో ఉన్న రోగనిరోధక వ్యవస్థ దాడి చేస్తుంది. ముందుగా పాదాల నుంచి మొదలై తల వరకు ఈ సిండ్రోమ్ దాడి చేస్తుంది. కండరాలు బలహీనమవుతూ భరించలేని నొప్పికి కారణమవుతుంది. ఈ సిండ్రోమ్ పెద్దవాళ్లలో, ముఖ్యంగా మగవాళ్లలో ఎక్కువగా సంక్రమిస్తుంది. తొలి దశలో మెట్లెక్కుతుంటేనో, నడుస్తుంటేనో కూడా విపరీతమైన నీరసం రావడాన్ని దీని తొలి లక్షణంగా భావించవచ్చు.
తర్వాతి దశలో శ్వాసప్రక్రియను నియంత్రించే కండరాలు బాగా బలహీనపడతాయి. ఈ లక్షణాలు తలెత్తిన రెండే రెండు వారాల్లో సమస్య బాగా ముదిరి రోగిని కదల్లేని స్థితికి చేరుస్తుంది. నరాలు బాగా దెబ్బ తింటాయి. చర్మంలోపల పురుగులు పాకుతున్నట్టు చెప్పలేని బాధ కలుగుతుంది. దవడలు నొప్పిగా మారుతాయి. మాట్లాడటం, నమలడం, మింగడం ఇబ్బందిగా ఉంటుంది. హృదయ స్పందనలో, రక్తపోటులో తేడాలు వస్తాయి. జీర్ణశక్తి మందగిస్తుంది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)