COVID19 in India: గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 43,893 పాజిటివ్ కేసులు నమోదు, భారత్‌లో 80 లక్షలకు చేరువైన మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య, ప్రస్తుతం 6 లక్షల కేసులు ఆక్టివ్
Coronavirus Cases in India (Photo Credits: IANS)

New Delhi, October 28: దేశంలో లాక్డౌన్ 5 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం నవంబర్ 30 వరకు పొడగించింది. దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు తగ్గుతున్నప్పటికీ కొవిడ్ వ్యాప్తి మాత్రం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 43,893 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య బుధవారం ఉదయం నాటికి 79,90,322కు చేరింది. నిన్న ఒక్కరోజే 508  కొవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,20,010 కు పెరిగింది.

మరోవైపు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 58,439 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 72,59,509  మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 6,10,803 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్నటి నుంచి ఈరోజు వరకు ఒక్కరోజులోనే ఆక్టివ్ కేసుల సంఖ్య 15,054 తగ్గడం ఊరటనిచ్చే విషయం. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

India's COVID Update:

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 90.85% ఉండగా, ప్రస్తుతం తీవ్రత  (యాక్టివ్ కేసులు) 7.64% శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.50% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇక అక్టోబర్ 27 వరకు దేశవ్యాప్తంగా 10,54,87,680 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 10,66,786 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక కరోనావైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న రాష్ట్రాలలో దేశంలోనే మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతుంంది. ఈ రాష్ట్రంలో కేసులు 16,54,028కు చేరగా, కొవిడ్ మరణాలు 43,463కు పెరిగాయి. గణాంకాల ప్రకారం మహారాష్ట్ర తర్వాత ఆంధ్రప్రదేశ్,  కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ మరియు కేరళ రాష్ట్రాలు కొనసాగుతున్నాయి.