Jammu And Kashmir: ఎన్‌కౌంటర్‌లో నలుగురు తీవ్రవాదులు హతం, అనంతనాగ్ జిల్లాలో భద్రతా దళాలు, తీవ్రవాదుల మధ్య కాల్పులు
File image of security forces in Jammu and Kashmir (Photo Credits: IANS)

Srinagar, March 15:జమ్మూ కాశ్మీర్‌లోని (Jammu And Kashmir) అనంతనాగ్ (Anantnag) జిల్లాలోని ఆదివారం భద్రతా దళాలు, తీవ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు తీవ్రవాదులను హతమయ్యారని పోలీసులు వెల్లడించారు. జిల్లాలోని డయాల్‌గామ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు (terrorists) ఉన్నారన్న నిర్థిష్ట సమాచారంతోనే ఆదివారం ఉదయం భద్రతా బలగాలు ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.

తర్వాత ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న భద్రతా బలగాలు తమ ఆపరేషన్‌ను నిర్వహించాయి. ఈ నేపథ్యంలోనే భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలోనే నలుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఎదురుచూస్తున్నామని అధికారి తెలిపారు.

అలాగే, శుక్రవారం, జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మృతి చెందాడు. ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్ స్పెషల్ పోలీస్ ఆఫీస్ (ఎస్‌పిఓ), ఉగ్రవాదులు, బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక పౌరుడు మరణించిన కొన్ని రోజుల తరువాత ఈ ఎన్ కౌంటర్ జరిగింది.

ఈ సంఘటన మార్చి 4 న జిల్లాలోని సోపోర్ ప్రాంతంలో జరిగింది. బలగాలు తరువాత తిరుగుబాటుదారులను కనిపెట్టడానికి ఒక ఆపరేషన్ను పట్టుకున్నాయి. నేడు హతమయిన ఉగ్రవాదికి మార్చి 4 ఎన్‌కౌంటర్‌తో సంబంధం ఉందా లేదా అని ప్రాథమిక నివేదికలు నిర్ధారించలేకపోయాయి. మరిన్ని వివరాలు సేకరించేందుకు ఆర్మీ ప్రయత్నిస్తోంది.