Karnataka shocker: ఒంటరిగా ఉన్న బాలికపై దారుణం, బాగా మందు తాగి బాలికను చీకటి ప్రదేశంలోకి లాక్కెళ్లి కామాంధులు అత్యాచారం, నలుగురిని అరెస్ట్ చేసిన కర్ణాటక పొలీసులు
Image used for representational purpose only | (Photo Credits: ANI)

Bengaluru, Feb 21: కర్నాటకలోని కోలార్ జిల్లాలోని కామసముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలో 14 ఏళ్ల బాలిక తన పుట్టినరోజు సందర్భంగా సామూహిక అత్యాచారానికి (14-year-old runaway girl gang) పాల్పడిన ఘటన సంచలనం రేపింది. పని ఇస్తామని నమ్మించి 9వ తరగతి చదువుతున్న బాలికపై దుండగులు ఈ సామూహిక అత్యాచారానికి (girl gang-raped on her birthday) పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తన పుట్టిన రోజు నాడు కొత్త దుస్తులు, చాక్లెట్లు కొనివ్వలేదని అలిగి తాలూకాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఆటోలో బంగారు పేటకు చేరుకుంది.

బస్టాండ్‌ వద్ద ఉండగా ఆనంద్‌కుమార్, కాంతరాజు, ప్రవీణ్, వేణు అనే యువకులు బాలికకు పని ఇప్పిస్తామని నమ్మించారు. ఆమెతో ముచ్చటగా మాట్లాడి పార్కుకు తీసుకెళ్లి సాయంత్రం వరకు అక్కడే గడిపారు. సాయంత్రం ఆమెను ప్రైవేట్ బస్సులో తానిమడగు గ్రామానికి నిందితులు తీసుకెళ్లారు. మార్గమధ్యంలో నిందితులు మద్యం సేవించి, ఏకాంత ప్రదేశంలో ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడే వదిలేసి పరార్ అయ్యారు.

కర్ణాటకలో భజరంగ్ దళ్ కార్యకర్త దారుణ హత్య, హిజాబ్‌కు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టాడనే ఆరోపణలు, శివమొగ్గ జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, దాడికి హిజాబ్ వివాదం కారణం కాదని తెలిపిన కర్ణాటక హోం శాఖ మంత్రి అరగా జ్ఞానేంద్ర

బాలిక అరుపులు విన్న గ్రామస్థులు కామసముద్రం పోలీసులకు సమాచారం అందించారు. బాలిక పరిస్థితిని చూసి బంగారుపేట ఆస్పత్రిలో చేర్పించారు. తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు గంటల వ్యవధిలోనే నలుగురు నిందితులను అరెస్ట్‌ చేసి పోక్సో కేసు నమోదు చేశారు. ముగ్గురు మేస్త్రీలు, ఒకరు బస్సు డ్రైవర్ గా పని చేస్తున్నారు.