Karnataka Horror: మొబైల్ కొనిస్తామని బాలికను రూంలోకి పిలిచి దారుణం, ఒకరి తర్వాత సామూహిక అత్యాచారం, కర్ణాటకలో షాకింగ్ ఘటన వెలుగులోకి
Credits: Google

Hubbali, Mar 10: కర్ణాటకలోని హుబ్బలిలో సామూహిక అత్యాచార ఘటన ( Minor girl gang-raped) వెలుగు చూసింది. నివేదికల ప్రకారం, మైనర్ బాలికకు మొబైల్ ఫోన్ కొనిస్తానని చెప్పి సామూహిక అత్యాచారానికి పాల్పడినందుకు నలుగురు అబ్బాయిలు, దేవరాజ్, ఫకీరేష్, వారి ఇద్దరు స్నేహితులపై హుబ్బళి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మార్చి 8న జరిగినట్లు సమాచారం.

నిందితుల్లో ఒకరైన దేవరాజ్ తన స్నేహితుడు సాగర్ ద్వారా 17 ఏళ్ల బాలికకు పరిచయం అయ్యాడు. ఇద్దరూ స్నేహితులయ్యారు. తనకు మొబైల్ ఫోన్ కొనిస్తానని (buying mobile phone ) చెప్పి హుబ్బళ్లి రావాలని దేవరాజ్ బాలికను కోరాడు. ఆ తర్వాత బాలికపై నలుగురు అబ్బాయిలు అత్యాచారానికి పాల్పడ్డారు.బాలిక ఫిర్యాదు మేరకు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. తనపై సామూహిక లైంగిక దాడి జరిగినట్లు బాలిక చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

టీ వేడిగా లేదని కోడలిపై అరిచిన అత్త, కోపంతో రాడ్డు తీసుకుని అత్త తల పగలగొట్టిన కోడలు, తమిళనాడులో షాకింగ్ ఘటన వెలుగులోకి ..

తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఇలాంటి ఘటనలో మైనర్ బాలికపై ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్నేహితుడు హుక్కా బార్‌లో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కాన్పూర్‌లో చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలికకు శీతల పానీయం తాగించి హుక్కా బార్‌లో నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు.

తండ్రితో కలిసి తప్పతాగిన కొడుకు, అయినా మందు సరిపోలేదంటూ తల్లిని దారుణంగా హత్య చేసిన కసాయి, కేరళలో షాకింగ్ ఘటన

బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు ఆమెకు మద్యం తాగించి, ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు మైనర్ బాలికను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడని, అక్కడ అతని ఏడుగురు స్నేహితులు అతనితో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి ప్రయత్నించారని, అయితే బాలిక వారి ప్రయత్నాన్ని ప్రతిఘటించిందని ఫిర్యాదుదారు ఆరోపించారు. ఆ తర్వాత నిందితుడు ఆమె శరీరమంతా కొరికాడు. బాలిక తప్పించుకుని ఇంటికి చేరుకుని జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.