Mann Ki Baat: ఏపీ కుర్రాడు సాయి ప్రణీత్పై ప్రధాని మోడీ ప్రశంసలు, ఏపీ వెదర్ మన్ పేరుతో రైతులకు సమాచారం అందిస్తూ మంచి పనిచేస్తున్నారని వెల్లడి, మన్ కీ బాత్లో మాట్లాడిన ప్రధాని
ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ (Mann ki Baat) ద్వారా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ యొక్క వాతావరణవేత్త సాయి ప్రణీత్ బి మరియు ఒడిశా యొక్క ఇంటర్నెట్ సంచలనం ఇసాక్ ముండా యొక్క స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణాలను దేశ ప్రజలతో పంచుకున్నారు.
New Delhi, July 25: ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ (Mann ki Baat) ద్వారా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఆంధ్రప్రదేశ్ యొక్క వాతావరణవేత్త సాయి ప్రణీత్ బి మరియు ఒడిశా యొక్క ఇంటర్నెట్ సంచలనం ఇసాక్ ముండా యొక్క స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణాలను దేశ ప్రజలతో పంచుకున్నారు. వీరిని ప్రజలకు పరిచయం చేసిన ప్రధాని వీరి ఆలోచనలతో కూడిన సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉపయోగించబడుతోందో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సాయి ప్రణీత్ బిని (PM Modi praises AP’s weatherman) పిఎం మోడీ పరిచయం చేశారు, నిజ సమయ వాతావరణ నవీకరణలు లేకపోవడం వల్ల జీవనోపాధి దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్లోని చాలా మంది రైతులకు సహాయం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని సాయి (Sai Praneeth B) సృజనాత్మకంగా రూపొందించారు. 24 ఏళ్ల ప్రణీత్ తన సోషల్ మీడియా ఉనికి ద్వారా అనేక గ్రామీణ మరియు పట్టణ ప్రజలకు సహాయం చేసాడని కొనియాడారు.
Here's PM Tweet
Inspiring life journeys from Andhra Pradesh and Odisha, which show how technology is being harnessed for greater good.
Do know more about @APWeatherman96 and Isak Munda. pic.twitter.com/gMI66NvoWq
— PMO India (@PMOIndia) July 25, 2021
ఈ రోజు మోదీ మన్ కీ బాత్లో (PM Modi Mann Ki Baat) మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాల్లో రైతులకు ఏపీ వెదర్ మన్ (AP’s weatherman) పేరుతో వాతావరణ సమాచారం అందిస్తూ సాయి ప్రణీత్ మంచి పని చేస్తున్నారని అన్నారు. బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పనిచేస్తోన్న సాయి ప్రణీత్ తాను రైతులకు అందిస్తోన్న సేవలకు గాను ఐక్యరాజ్యసమితి, భారత వాతావరణ శాఖ నుంచి కూడా గతంలో ప్రశంసలు అందుకున్నారు. ఆయన సేవలను మన్ కీ బాత్లో మోదీ ప్రస్తావించారు.
అలాగే, చండీగఢ్కు చెందని 29 ఏళ్ల సంజయ్ రాణాను కూడా మోదీ ప్రశంసించారు. ఆ యువకుడు ఫుడ్ స్టాల్ ను నిర్వహిస్తుంటాడని, సైకిల్ పై తిరుగుతూ ఛోలే భతూర్ అనే వంటకాన్ని అమ్ముతుంటాడని మోదీ అన్నారు. కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారికి ఆయన ఉచితంగా దాన్ని అందిస్తూ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. మరోవైపు, తమిళనాడులోని నీలగిరికి చెందిన రాధిక శాస్త్రి అనే మహిళ అంబర్క్స్ ప్రాజెక్ట్ చేపట్టి సేవలందిస్తున్నారని ప్రధాని మోదీ ప్రశంసించారు. కొండ ప్రాంతాల ప్రజలు ఆసుపత్రులకు వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందుల గురించి తెలుసుకుని వారి కోసం ఆమె ఉచితంగా రవాణా సదుపాయాలను కల్పిస్తున్నారని చెప్పారు.
తన సహచర ఉద్యోగుల వద్ద విరాళాలు సేకరించి ఆమె ఈ సేవలు కొనసాగిస్తున్నారని మోదీ వివరించారు. ఆమె మొత్తం ఆరు అమ్బర్క్స్ (ప్రత్యేక ఆటోల ద్వారా వైద్య సదుపాయం) సర్వీసులు నడిస్తున్నారని కొనియాడారు. కాగా, పండుగలు, శుభకార్యాలు జరుపుకునే సమయంలో కరోనా ఇంకా తొలగిపోలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మోదీ దేశ ప్రజలకు సూచించారు. కరోనా ఇంకా మన మధ్యే ఉందని, కొవిడ్ నియంత్రణ నియమాలను మర్చిపోకూడదని ఆయన చెప్పారు.
(The above story first appeared on LatestLY on Jul 25, 2021 02:01 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

