Delhi Election Results LIVE: ఢిల్లీని ఏలే రాజు ఎవ్వరు? ఆమ్ ఆద్మీ పార్టీనా? బీజేపీనా? లేక హస్తమా?? క్షణ క్షణం ఉత్కంఠ రేపుతోన్న ఢిల్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్ డేట్స్.. (లైవ్)
ఢిల్లీని ఏలే రాజు ఎవ్వరు? నాలుగోసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే ఢిల్లీని ఏలుతుందా? లేక రెండు దశాబ్దాల వనవసానికి ఎండ్ కార్డ్ వేస్తూ ఢిల్లీని బీజేపీ కైవసం చేసుకుంటుందా?
Newdelhi, Feb 8: హస్తినాను (Delhi) ఏలే రాజు ఎవ్వరు? నాలుగోసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే (AAP) ఢిల్లీని ఏలుతుందా? లేక రెండు దశాబ్దాల వనవసానికి ఎండ్ కార్డ్ వేస్తూ ఢిల్లీని బీజేపీ కైవసం చేసుకుంటుందా? ఎవరూ ఊహించని విధంగా హస్తం రేసులోకి వస్తుందా? ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఏం తేలబోతోంది.. క్షణ క్షణం ఉత్కంఠ రేపుతోన్న ఢిల్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్ డేట్స్ కోసం కింది లైవ్ ను చూడండి..
LIVE:
బీజేపీ ధీమా ఇది..
ఢిల్లీ ఎన్నికల కౌంటింగ్ కోసం 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. ఈనెల 5వ తేదీన పోలింగ్ జరగ్గా 60.54 శాతం ఓటింగ్ నమోదైంది. తమ పార్టీ దగ్గర దగ్గరగా 50 సీట్లు కైవసం చేసుకోవడం ద్వారా అధికారంలోకి వస్తుందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా దాదాపుగా ఇదే విషయాన్ని చెప్పాయి.
కేజ్రీకి నోటీసులు
అయితే, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పుతాయని, కేజ్రీవాల్ ఆధ్వర్యంలో మరోసారి తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆప్ చెబుతోంది. మరోవైపు.. బీజేపీ నేతలు తమ పార్టీకి చెందిన 16మంది ఎమ్మెల్యేలను కమలదళంలోకి చేరాలని, ప్రలోభపెట్టారని ఇందుకు రూ.15 కోట్లు ఇవ్వజూపారని కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై బీజేపీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ విచారణకు ఆదేశించారు. ఈమేరకు ఏసీబీ అధికారులు శుక్రవారం కేజ్రీవాల్ కు నోటీసులు జారీచేశారు.
(The above story first appeared on LatestLY on Feb 08, 2025 08:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

