ఆంధ్రప్రదేశ్లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ పరీక్ష ఫలితాలు (AP EAPCET Results) విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె.రామమోహన్ రావు, జేఎన్టీయూ కాకినాడ వీసీ ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు తదితరులు విడుదల చేశారు.
...