భారత్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజువారీ కేసులు (Coronavirus in India) లక్షకు దిగువనే నమోదవుతుండటం ఊరట కలిగిస్తోంది. నిన్న 80,834 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 2 తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కేసుల నమోదుకావడం ఇదే తొలిసారి. నిన్న 1,32,062 మంది కోలుకున్నారు.
...