పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలకు అధికారికంగా ముగింపు పలికే ప్రక్రియ ప్రారంభమైంది. నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే బ్యాంకింగ్ లైసెన్స్ను రద్దు చేయగా.. ఇప్పుడు బ్యాంక్ను పూర్తిగా మూసివేసేందుకు ఢిల్లీ హైకోర్టు లిక్విడేషన్కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బ్యాంక్ వ్యవహారాలన్నీ ఇక అధికారిక లిక్విడేటర్ పర్యవేక్షణలో కొనసాగనున్నాయి.
...