తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం రాత్రి నుండి రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తాంధ్ర పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.
...