ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మిజోరం సరిహద్దు ఇప్పుడు దాడులతో (Assam-Mizoram Border Dispute) అట్టుడుకుతోంది. సోమవారం జరిగిన ఘర్షణల్లో అస్సాంకు చెందిన ఐదుగురు పోలీసులు మరణించారు. ఈ ఘటన అక్కడ మరింతగా ఉద్రిక్తతలను పెంచింది. ఈ సమస్య ఎప్పటి నుంచో అక్కడ రగులుతూ ఉన్నప్పటికీ పాలకులు దీనికి సరైన పరిష్కారం చూపలేకపోవడంతో అది రావణకాష్టంలా రగులుతూనే ఉంది.
...