సనాతన ధర్మంలో గురు పూర్ణిమ (వ్యాస పూర్ణిమ) అత్యంత పవిత్రమైన పర్వదినంగా చెప్పుకోవచ్చు. అజ్ఞానమనే చీకటిని తొలగించి.. జ్ఞానమనే వెలుగు వైపు నడిపించే గురువులను, మార్గదర్శకులను, తల్లిదండ్రులను పూజించుకోవడానికి ఈ రోజును కేటాయించారు. హిందూ పంచాంగం ప్రకారం.. ప్రతి ఏటా ఆషాఢ మాసంలోని పౌర్ణమి తిథి నాడు ఈ పండుగను జరుపుకుంటారు.
...