జియో సినిమా బాటలో వాల్ట్డిస్నీ కో హాట్స్టార్ ప్రయాణిస్తున్నది. ఇక నుంచి భారత్ లో జరిగే అన్ని క్రికెట్ టోర్నమెంట్లపై మొబైల్ ఫోన్లలో ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం (Streaming) చేయనున్నది. క్రికెట్ పట్ల క్రేజ్ ఉన్న భారతీయుల మనస్సు చూరగొనేందుకు ఇటీవలే ముగిసిన ఐపీఎల్-2023 సీజన్లో రిలయన్స్ జియో ఆధీనంలోని ఓటీటీ ప్లాట్ఫామ్.. జియో సినిమా లక్షల మంది వీక్షకులను సొంతం చేసుకున్నది.
...