ఐపీఎల్-15వ సీజన్లో ప్లే ఆఫ్స్ చేరిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. లీగ్లో మొదటి సారి బరిలోకి దిగిన టైటాన్స్ ఆడిన 12 మ్యాచ్ల్లో తొమ్మిదింట నెగ్గి 18 పాయింట్లతో అధికారికంగా ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన ‘లో స్కోరింగ్’మ్యాచ్లో గుజరాత్ 62 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్పై విజయం సాధించింది.
...