జాతీయ క్రీడల్లో తెలుగు క్రీడాకారులు శుభారంభాన్ని అందించారు. ఇప్పటికే మహిళల 100 మీటర్ల పరుగులో ఏపీకి చెందిన జ్యోతి యర్రాజి స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణకు చెందిన మహిళా షూటర్ ఈషా సింగ్ సత్తా చాటింది. 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణ పతకాన్ని సాధించిన ఈషా సింగ్ తెలంగాణ ఖాతాలో తొలి పతకాన్ని చేర్చింది.
...