గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో 55,002 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2,620 మందికి కరోనా పాజిటివ్గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 44 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,363 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 7,504 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 17 లక్షల 82 వేల 680 మంది డిశ్చార్జ్ అయ్యారు.
...