బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక విషయంలో ఇంకా సస్పెన్స్ (Brahmamgari Matham Dispute) కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. బ్రహ్మంగారి మఠం విషయంలో చట్టప్రకారం వెళ్తామని మంత్రి (AP Minister Vellampalli Srinivas) స్పష్టం చేశారు. వీలునామా చట్టప్రకారం 90 రోజుల్లో ధార్మిక పరిషత్కు చేరాలని తెలిపారు. పీఠాధిపతులతో కమిటీ వేసి చట్టప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
...