ఈ వ్యాఖ్యలపై డీజీపీ గౌతం సవాంగ్ (AP DGP Sawang) స్పందించారు. పట్టాభి నిన్న దారుణమైన భాష మాట్లాడారని డీజీపీ అన్నారు. పార్టీ కార్యాలయం నుంచి పట్టాభి మాట్లాడిన తర్వాతే ఆందోళనలు మొదలయ్యాయని చెప్పారు. రాజకీయ పార్టీలు, నేతలు బాధ్యతాయుతంగా ఉండాలని... రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారిని దుర్భాషలాడటం సరికాదని అన్నారు.
...