ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. చదువు చెప్పాల్సిన ఓ ప్రొఫెసర్ సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ పాడు పనిలో ప్రొఫెసర్తో పాటు కళాశాల సిబ్బంది, ఇతర వ్యక్తులు కూడా పాలుపంచుకుంటున్నారని బాధిత విద్యార్థినులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళితే కీచక ప్రొఫెసర్ ప్యారేలాల్ ప్రైవేటు పాఠాల పేరిట విద్యార్థినులను బలవంతంగా మత్తు పదార్థాలు సేవింప చేసేవాడని, ఆపై శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ప్రొఫెసర్కు మద్దతుగా నిలిచిన కొందరు సిబ్బంది పేర్లను కూడా విద్యార్థినులు బయటపెట్టారు. అసభ్యకరమైన పుస్తకాలు, నీలి చిత్రాలు చూపి ప్రొఫెసర్ విద్యార్థినులను బలవంతం చేశాడని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాలేజీకి చెందిన విద్యార్థులను ప్రొఫెసర్ ఇంటికి పిలిపించుకుని బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకున్నాడని ప్రచారం జరుగుతోంది. చాలా మంది అమ్మాయిలతో ఆయన సంబంధాలు పెట్టుకున్నాడని, ప్రొఫెసర్కు డ్రగ్స్ వాడకం గురించి తెలుసునని వాటితో అమ్మాయిలను నియంత్రిస్తాడని మరొక విద్యార్థి చెప్పాడు. పోలీసులు కేసు దర్యాప్తులో నిమగ్నమయ్యారు ఇదిలా ఉంటే సంఘటన విషయానికి వస్తే బాధిత యువతి కాలేజీలో కొత్తగా చేరిందని, కరోనా అనంతరం క్లాసులు మొదలవ్వడంతో, ఆ యవతి ప్రొఫెసర్ తరచూ డౌట్స్ కోసం అతడి స్టాఫ్ రూంకు వెళ్లేదని, కానీ ఆ సమయంలో కీచక ప్రొఫెసర్ యువతిని అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడని, అంతేకాదు యువతిని తన ఇంటికి రమ్మని ఆహ్వానించి అక్కడ యువతికి తెలియకుండా మత్తు పదార్థాలు ఇచ్చి లైంగికదాడి చేశాడని, ఆపై తన స్నేహితులకు కూడా శారీరక సుఖం ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేశాడని బాధితురాలు ఆరోపించింది.
ప్రస్తుతం ప్రొఫెసర్ పరారీలో ఉన్నాడని, అతని కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారని కళాశాల యాజమాన్యం తెలిపింది. ఈ వ్యవహారం త్వరలోనే పరిష్కారమవుతుందని పోలీసులు చెబుతున్నారు.