Hyderabad, Oct 21: రాజకీయాలు, ప్రజాసేవా కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతున్న ‘లేడీ అమితాబ్’ విజయశాంతి (Vijayashanthi) చాలా గ్యాప్ తర్వాత మరోసారి వెండితెరపై మెరవబోతున్నారు. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే మళ్లీ సినిమాలు చేయబోనని ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రమోషన్స్ సమయంలో చెప్పిన రాములమ్మ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకు తగ్గట్టే కొన్ని అవకాశాలు వచ్చినా ఆమె తిరస్కరిస్తూ వచ్చారు. అయితే తాజాగా నందమూరి కల్యాణ్‌ రామ్‌ (Kalyan Ram) హీరోగా ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమాకు ఆమె ఓకే చెప్పినట్టు నిర్ధారణ అయ్యింది. శుక్రవారం ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో నిర్వహించిన పూజా కార్యక్రమాల ద్వారా క్లారిటీ వచ్చింది. పూజా కార్యక్రమాలకు విజయశాంతి కూడా హాజరయ్యారు. కాగా.. స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో విజయశాంతి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Baby Combo Repeat: మరోసారి తెరమీదకు బేబీ కాంబో, ఆనంద్-వైష్ణవీ లీడ్ రోల్స్‌లో నిర్మాతగా మారిన బేబీ డైరక్టర్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫస్ట్ లుక్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)