దేశంలో కొత్తగా 1007 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,39,023కు చేరాయి. ఇందులో 4,25,06,228 మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. మరో 11,058 మంది చికిత్స పొందుతుండగా, 5,21,737 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో 818 మంది కరోనా నుంచి బయటపడగా, ఒకరు మహమ్మారికి బలయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.23 శాతంగా ఉందని, మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.03 శాతమని, రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు 83.03 కోట్ల మందికి కరోనా పరీక్ష చేశామని, ఇందులో బుధవారం ఒక్కరోజే 4,34,877 మందికి టెస్టులు చేశామని పేర్కొన్నది

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)