దేశంలో కొత్తగా 2841 మంది కరోనా పాజిటివ్లుగా నిర్ధారణ అయ్యారు. దీంతో మొత్తం కరోనా బాధితులు 4,31,16,254కు చేరారు. ఇందులో 4,25,73,460 మంది డిశ్చార్జీ అయ్యారు. 18,604 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మరో 5,24,190 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో 9 మంది మృతిచెందగా, 3295 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.04 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.74 శాతంగా ఉందని, మరణాల రేటు 1.22 శాతంగా ఉందని వెల్లడించింది. ఇప్పటివరకు 1,90,99,44,803 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని తెలిపింది. గురువారం ఒకేరోజు 14,03,220 మందికి వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించింది.
2,841 new COVID19 cases recorded in India today; Active cases at 18,604 pic.twitter.com/NiNSNT7ILE
— ANI (@ANI) May 13, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)