దేశంలో గత నాలుగు రోజులుగా 8 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా, నేడు ఆ సంఖ్య 12 వేలు దాటింది. కొత్తగా 12,213 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఫిబ్రవరి 26 తర్వాత అంటే గత 109 రోజుల్లో ఒకేరోజు 10 వేలకుపైగా కేసులు రికార్డవడం ఇదే మొదటిసారి. కాగా, బుధవారం నాటికంటే ఇది 38.4 శాతం అధికం. యాక్టివ్‌ కేసులు కూడా 60 వేలకు చేరువయ్యాయి. రోజువారీ కేసులు ఒక్కసారిగా పెరుగుతుండటంతో మొత్త బాధితులు 4,32,57,730కి చేరారు. ఇందులో 4,26,74,712 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,803 మంది మరణించారు. మరో 58,215 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 11 మంది కరోనాతో మృతిచెందగా, 7624 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

దేశంలో ఈ దఫా కూడా మహారాష్ట్ర కరోనా కేంద్రంగా మారింది. దేశంలో కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా 4,024 కేసులు మరఠ్వాడాలోనే ఉన్నాయి. ఇక కేరళలో 3488, ఢిల్లీలో 1378, కర్ణాటకలో 648, హర్యానాలో 596, తమిళనాడులో 476 చొప్పున మోదయ్యాయి. కాగా, రోజువారీ పాజిటివిటీ రేటు 2.35 శాతానికి చేరుకున్నది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.13 శాతానికి చేరాయి. రికరీరేటు 98.65 శాతంగా, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,95,67,37,014 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)