దేశంలో మంగళవారం 1,675 మందికి పాజిటివ్రాగా, తాజాగా ఆ సంఖ్య 2124కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,31,42,192కు చేరాయి. ఇందులో 4,26,02,714 మంది కోలుకోగా, 14,971 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు కరోనాతో 5,24,507 మంది మృతి చెందారు. కాగా, గత 24 గంటల్లో 1977 మంది కరోనా నుంచి బయటపడగా, 17 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని తెలిపింది. అదేవిధంగా 98.75 శాతం మంది బాధితులు డిశ్చార్టీ అయ్యారని, 1.22 శాతం మరణించారని పేర్కొన్నది. ఇక రోజువారీ పాజిటివిటీ 0.46 శాతంగా ఉందని వెల్లడించింది. మంగళవారం 13,27,544 మందికి వ్యాక్సినేషన్ చేశామని, దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన కరోనా టీకా డోసుల సంఖ్య 1,92,67,44,769కి చేరిందని తెలిపింది.
#COVID19 | India reports 2,124 fresh cases, 1,977 recoveries, and 17 deaths in the last 24 hours.
Total active cases are 14,971. Daily positivity rate 0.46% pic.twitter.com/IRvqOnniBt
— ANI (@ANI) May 25, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)