Covid in India: మళ్లీ రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, గత 24 గంటల్లో 4518 మందికి కోవిడ్, కొత్తగా 9 మంది మరణించగా, 2,779 మంది డిశ్చార్జీ

దేశంలో ఆదివారం 4270 మందికి పాజిటివ్‌ నిర్ధారణకాగా, నేడు మరో 4518 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసులు 43,181,335కు చేరాయి. ఇందులో 4,26,30,852 మంది బాధితులు కోలుకోగా, ఇప్పటివరకు 5,24,701 మంది మృతిచెందారు.

Coronavirus | Representational Image | (Photo Credits: ANI)

దేశంలో ఆదివారం 4270 మందికి పాజిటివ్‌ నిర్ధారణకాగా, నేడు మరో 4518 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసులు 43,181,335కు చేరాయి. ఇందులో 4,26,30,852 మంది బాధితులు కోలుకోగా, ఇప్పటివరకు 5,24,701 మంది మృతిచెందారు. ఇంకా 25,782 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 9 మంది మరణించగా, 2,779 మంది డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.06 కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికరీ రేటు 98.73 శాతం, మరణాల రేటు 1.22 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,94,12,87,000 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని, ఆదివారం ఒక్కరోజే 2,57,187 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చామని పేర్కొన్నది

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement