మిచౌంగ్ తీవ్ర తుఫాన్ బాపట్ల సమీపంలో తీరాన్ని తాకింది. కాసేపట్లో తుఫాను తీరాన్ని దాటనుంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం ప్రకాశం, గుంటూరు, కృష్ణ, వెస్ట్ గోదావరిలో, విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక చెన్నైలో ఎయిర్ పోర్టు పూర్తిగా నీట మునిగింది. భారీ వర్షాలకు విమానాశ్రయం లోపలకి వరద నీరు చేరడంతో విమాన రాకపోకలు నిలిపివేశారు. ఈ రొజు ఉదయం విమాన సేవలను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.కార్లు సైతం వరద నీటిలో పూర్తిగా మునిగిపోయాయి. కారుపై భాగం మాత్రమే వీడియోల్లో కనిపిస్తున్న దృశ్యాలు వరద భీభత్సాన్ని తెలియజేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)