అదానీ గ్రూపు కంపెనీలకు వ్యతిరేకంగా వచ్చిన ఆరోపణలపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. శివసేన ఉద్దవ్ థాకరే పార్టీ ఎంపీ సంజయ్ రౌత్.. ఆదాని అంశంపై విభిన్నంగా స్పందించారు. ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డేని ‘కౌ హగ్ డే’గా జరుపుకోవాలంటూ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ పిలుపునిచ్చింది. ఈ రెండు అంశాలకు ముడిపెడుతూ సంజయ్ రౌత్ వ్యంగ్యంగా మాట్లాడారు.

బీజేపీకి అదానీ పవిత్ర గోవు. అందుకే వారు పవిత్రమైన ఆవును హగ్ చేసుకుని, మిగిలిన ఆవులను వేలంటైన్స్ డే రోజు మనం హగ్ చేసుకునేందుకు వదిలిపెట్టారు’’ అంటూ సంజయ్ రౌత్ చమత్కరించారు. అయినప్పటికీ మనం గోమాతను గౌరవిస్తామంటూ, వాటి పట్ల మన ప్రేమను చూపించేందుకు ప్రత్యేకంగా ఒక రోజు అవసరం లేదని రౌత్ అన్నారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)