దేశంలో శుక్రవారం సుమారు 18 వేల కేసులు నమోదవగా, శనివారం 15,940కి తగ్గాయి. కొత్తగా 11,739 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,33,89,973కు చేరాయి. ఇందులో 4,27,72,398 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మరో 92,576 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,999 మంది కరోనాతో మరణించారు. కాగా, గత 24 గంటల్లో 25 మంది మృతిచెందగా, 10,917 మంది డిశ్చార్జీ అయ్యారు.
మొత్తం కేసుల్లో 0.21 శాతం కేసులు యాక్టివ్గా ఉన్నాయని, రికవరీ రేటు 98.58 శాతం, మరణాల రేటు 1.21 శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 2.59 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ 197 కోట్లు దాటింది. శనివారం ఒక్కరోజే 11 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేశారు.
India reports 11,739 new Covid19 cases today; Active cases at 92,576 pic.twitter.com/DsOo9TbOxJ
— ANI (@ANI) June 26, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)