దేశంలో కొత్తగా 2451 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,30,52,425కు చేరాయి. ఇందులో 4,25,16,068 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,22,116 మంది మృతిచెందగా, 14,241 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో 54 మంది వైరస్కు బలవగా, 1589 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. ఇక మొత్తం కేసుల్లో 0.03 శాతం కేసులు మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 98.75 శాతం మంది కోలుకోగా, 1.21 శాతం మంది మృతిచెందారని తెలిపింది. దేశవ్యాప్తంగా 1,87,26,26,515 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని, నిన్న ఒక్కరోజే 18,03,558 మందికి వ్యాక్సినేషన్ చేశామని పేర్కొన్నది.
India reports 2,451 new COVID19 cases today; Active caseload at 14,241 pic.twitter.com/ikQuotdiCT
— ANI (@ANI) April 22, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)