దేశంలో మంకీ ఫాక్స్ కలకలం రేపుతోంది. తాజాగా కేరళలో రెండో కేసు నమోదైంది. కన్నూర్ జిల్లాలో రెండవ మంకీఫాక్స్ కేసు నమోదైందని అధికారులు వెల్లడించారు. "కన్నూరుకు చెందిన 31 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం పరియారం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. రోగి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. అతనితో సన్నిహితంగా ఉన్న వారిపై నిఘా ఉంచబడింది" అని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ చెప్పారు. ఇంతకు ముందు కేరళలోనే తొలి మంకీ పాక్స్ కేసు నమోదైన సంగతి విదితమే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)