Hyderabad: కీచక ప్రిన్సిపాల్.. విద్యార్థినిపై అత్యాచారయత్నం, ప్రిన్సిపాల్పై పోక్సో కేసు నమోదు, గతంలోనూ ప్రిన్సిపాల్పై అత్యాచార ఆరోపణలు!
రంగారెడ్డి జిల్లాలో కీచక ప్రిన్సిపాల్(principal) ఉదంతం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో చదివే విద్యార్థినిపై అత్యాచారయత్నంకు పాల్పడ్డాడు.
రంగారెడ్డి జిల్లాలో కీచక ప్రిన్సిపాల్(principal) ఉదంతం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో చదివే విద్యార్థినిపై అత్యాచారయత్నంకు పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఘటన. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని లయోలా పాఠశాలలో విద్యార్థినిపై ప్రిన్సిపల్ అత్యాచారయత్నంకు ప్రయత్నించాడు.
ప్రిన్సిపల్ పై ఫోక్సో కేసు(Pocso case) నమోదు చేశారు పోలీసులు. గతంలోనూ ప్రిన్సిపల్ పై పలు ఆరోపణలు రాగా విద్యార్థినిలను లోబర్చుకొని అత్యాచారం చేసినట్లుగా ఆరోపణలు వచ్చాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు పోలీసులు(Police case).
మరో ఘటనలో న్యాయం చేస్తానని నమ్మించి యువతిని గర్భవతిని చేశాడు ఓ కానిస్టేబుల్ . డబ్బుల విషయంలో కొందరు ఇబ్బంది పెడుతున్నారని.. గతేడాది మార్చి 21న మేడ్చల్ పోలీస్ స్టేషన్కు వచ్చింది యువతి. కేసు విషయమై మాట్లాడుదామని ఇంటికి పిలిపించుకుని.. తనకి పెళ్లి కాలేదని మాయమాటలు చెప్పి లైంగిక దాడి చేశాడు కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి.
Pocso case registered against principal at Hyderabad