Mumbai, JAN 28: నటి రాఖీ సావంత్ తల్లి (Rakhi Sawant) జయా బేడా (Jaya Bheda) కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్రెయిన్ ట్యూమర్‌ తో బాధపడుతున్న ఆమె...ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్లు రాఖీ సావంత్ భర్త ప్రకటించారు. తన తల్లి మరణంతో రాఖీ సావంత్ (Rakhi Sawant) బోరున ఏడుస్తున్నారు. గతంలో కూడా ఆమె తన తల్లి అనారోగ్యంపై సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టింది. తన తల్లి పడుతున్న బాధను షేర్ చేసుకుంది. రాఖీ సావంత్ బిగ్‌ బాస్ 14 సీజన్‌ లో పాల్గొంటున్న సమయంలోనే జయా బేడాకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. అప్పటి నుంచి ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. జయాబేడా మరణంపై రాఖీ సావంత్ సన్నిహితులు, ఆమె అభిమానులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by @varindertchawla

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)