కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి (Sonia Gandhi) కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉన్నారు. బుధవారం సాయంత్రం ఆమెకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని పార్టీ అధికార ప్రతినిధి రన్‌దీప్‌ సుర్జేవాలా చెప్పారు. సోనియాకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. కాగా, నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఈడీ ముందు హాజరవ్వాల్సి ఉండగా ఆమె కరోనా బారిన పడటం గమనార్హం. గత కొన్నివారాలుగా వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఈ క్రమంలో ఆమె జ్వరంతో ఇబ్బంది పడుతున్నారని సుర్జేవాలా చెప్పారు. పరీక్షలు చేయించగా పాజిటివ్‌గా తేలిందన్నారు. వైద్యుల సూచనమేరకు ప్రస్తుతం ఆమె స్వీయ నిర్భందంలో ఉన్నారని వెల్లడించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)