రాష్ట్రంలోని చేనేతల కష్టాలను పాదయాత్రలో కళ్లారా చూశానని, వారి బాధలు విన్నానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం జాతీయ చేనేత దినోత్సం సందర్భంగా సీఎం జగన్‌ నేత‌న్న‌లంద‌రికీ జాతీయ చేనేత దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. ‘చేనేత‌ల క‌ష్టాల‌ను నా 3648 కిలో మీటర్ల సుధీర్ఘ పాదయాత్రలో కళ్లారా చూశా. వారి బాధలు విన్నా. మన ప్రభుత్వం రాగానే వైఎస్సార్‌ నేత‌న్న నేస్తం ప‌థ‌కం ద్వారా అర్హుల‌కు ఏటా రూ.24వేలు ఇస్తూ వారికి అండ‌గా ఉంటున్నాం. నేత‌న్న‌లంద‌రికీ జాతీయ చేనేత దినోత్స‌వ శుభాకాంక్ష‌లు’ అని సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)