ఏపీలోని నంద్యాలలో 3వ తరగతి చదువుతున్న విద్యార్థినిని గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన కేసులో పోలీసుల సంచలన విషయాలను వెల్లడించారు. బాలికను అత్యాచారం చేసి చంపింది ఆ ముగ్గురు మైనర్ బాలురేనని సెల్‌ఫోన్లో వీడియోలు చూసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాలికను గొంతు నులిమి చంపిన వారికి ఏం చేయాలో అర్థం కాకపోవడంతో మృతదేహాన్ని రాయి కట్టి కృష్ణానదిలో పడేసారని తెలిపారు. నంద్యాలలో దారుణం, 3వ తరగతి విద్యార్థినిని గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసి కాలువలో పడేసిన ముగ్గురు మైనర్ అబ్బాయిలు

నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమరి గ్రామంలో బాలిక మిస్సింగ్ కేసులో ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ ఆదిరాజు సింగ్ రానా తెలిపారు. మైనర్ బాలిక పార్కు దగ్గర ఆడుకుంటూ ఉండగా అక్కడే ఉన్న ముగ్గురు బాలురు ఆ అమ్మాయికి చాక్లెట్ ఆశ చూపించి అత్యాచారం చేసి గొంతు నులిమి చంపారు అన్నారు. ఆ ముగ్గురు పిల్లలలో ఒక బాలుడి తండ్రి, మరో బాలుడి పెదనాన్న వారికి సహకరించి అమ్మాయి మృతదేహాన్ని కృష్ణానదిలో రాయి కట్టి పడేసినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారి సమాచారం మేరకు SDRF, NDRF, బృందాలతో సెర్చింగ్ నిర్వహించామని అమ్మాయిలు డెడ్ బాడీ కోసం గాలింపు చర్యలు చేస్తున్నామన్నారు.

Here's Police Statement

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)