ముంబైలోని భయందర్ రైల్వే స్టేషన్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. తండ్రీకొడుకులు స్థానిక రైల్వే స్టేషన్‌ పట్టాల పైకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన భయందర్ రైల్వే స్టేషన్‌లోని 6వ నంబర్ ప్లాట్‌ఫాంపై సోమవారం నాడు జరిగింది. ఆత్మహత్య చేసుకున్న తండ్రి పేరు హరీష్ మెహతా, కొడుకు పేరు జై మెహతాగా గుర్తించారు. వీరిద్దరూ విరార్‌ నుంచి చర్చిగేట్‌కు వెళ్తున్న లోకల్‌ ట్రైన్‌ ముందు దూకి ప్రాణాలు విడిచారు. వీరిద్దరూ వసాయ్ నివాసితులని చెబుతున్నారు. రైల్వే అధికారులు ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం పంపించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఈ వ్యవహారంపై వసాయ్ జీఆర్పీ విచారణ ప్రారంభించింది. వీడియో ఇదిగో, అప్పు ఇచ్చిన వారి వేదింపులు తట్టుకోలేక ఆత్మహత్య, 10 నుండి 20 రూపాయల వడ్డీకి తెచ్చి స్టాక్ మార్కెట్లలో పెట్టి నష్టపోయిన యువకుడు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)