అర్జెంటీనా బ్యూనోస్‌ ఎయిర్స్‌ ఇండిపెండెన్స్‌ స్టేషన్‌ వద్ద మార్చి 29వ తేదీన షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. క్యాండెల్లా అనే యువతి.. ప్లాట్‌ఫామ్‌ మీద నిల్చుని ఉంది. ఆ టైంలో బీపీ డౌన్‌ అయ్యి కళ్లు తిరిగి తులూతు వెళ్లి.. అప్పుడే వెళ్తున్న రైలుకు తగిలి.. ప్లాట్‌ఫామ్‌, రైలుకి మధ్య మధ్య పడిపోయింది. అది చూసి.. ఆమె పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ, అదృష్టం బాగుండి ఆమె చావును జయించగలిగింది.

రైలును ఆపేసి.. ఆమెను ఆ గ్యాప్‌లోంచి బయటకు తీశారు సిబ్బంది. అప్పటికే అక్కడికి చేరుకున్న ఆంబులెన్స్‌లో ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆ వీడియో చూశాక.. తాను నిజంగా బతికి ఉన్నానా? అనే అనుమానం క్యాండెల్లాకు కూడా కలిగిందట. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)