ఐపీఎల్‌-2022లో భాగంగా మార్చి 28న జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ పేసర్‌ దుష్మంత చమీరా అద్భుతమైన యార్కర్‌తో గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటర్‌ విజయ్‌ శంకర్‌ను పెవిలియన్‌కు పంపాడు. గుజరాత్‌ ​ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌ వేసిన చమీరా తొలి బంతికే విజయ్‌ శంకర్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. అయితే 145 కి.మీ.ల వేగంతో చమీరా వేసిన యార్కర్‌కు శంకర్‌ వద్ద సమాధానమే లేకుండా పోయింది. . దీంతో శంకర్‌(6 బంతుల్లో 4 పరుగులు) నిరాశగా పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఐపీఎల్‌-2022లో గుజరాత్‌ టైటాన్స్‌ బోణీ కొట్టింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)