ఏపీలో మద్యం మత్తులో ఓ మందుబాబు చేసిన హల్ చల్ తో బస్సు ప్రయాణికులు ఒక్కసారిగా వణికిపోయారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు సెంటర్లో మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు అద్దాలు పగలకొట్టి వీరంగం సృష్టించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి బస్సు నుండి దిగుతూ చేతిలో ఉన్న ఆయుధంతో బస్సు అద్దాలు పగలగొట్టడం చూడవచ్చు. అతన్ని వారించేందుకు మరో వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు.

వీడియో ఇదిగో, పుల్లుగా మద్యం తాగి నడిరోడ్డు మీద భార్యతో సబ్-ఇన్‌స్పెక్టర్ పాడు పని, వద్దన్నా వినకుండా దగ్గరకు లాక్కుని అసభ్యప్రవర్తన, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

స్కూటీ మీద తీసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ వ్యక్తి స్కూటి ఎక్కినట్లే ఎక్కి మళ్లీ దిగి బస్సు అద్దాలు పగలగొట్టాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందుతుడిని పట్టుకుని స్టేషన్ కి తరలించారు. అయితే అతను ఎందుకు అలా చేశాడనే దానిపై ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.

drunk man broke the windows of an RTC bus in Uyyuru Center

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)