ఏపీలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 55,323 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా వారిలో 1,246 మందికి కరోనా నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 207 కేసులు నమోదవగా, అత్యల్పంగా అనంతపురం, కర్నూలు, విజయనగరం జిల్లాలలో 13 కేసుల చొప్పున నమోదయ్యాయి. ఇక మొత్తం 1,450 మంది కరోనా నుంచి కోలుకోగా... 10 మంది మహమ్మారి వల్ల మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,44,490కి చేరుకుంది. మొత్తం 20,16,837 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 14,118 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,535 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
#COVIDUpdates: As on 24th September 2021 10:00AM
COVID Positives: 20,44,490
Discharged: 20,13,942
Deceased: 14,118
Active Cases: 13,535#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/oQwJI4sRbI
— ArogyaAndhra (@ArogyaAndhra) September 24, 2021
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)