ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు ఇంకా వస్తూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో 30,752 శాంపిల్స్ పరీక్షించగా, 141 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 27, చిత్తూరు జిల్లాలో 26, గుంటూరు జిల్లాలో 24 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 165 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 20,76,687 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,61,122 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,073 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,492కి పెరిగింది.
#COVIDUpdates: 28/12/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,73,792 పాజిటివ్ కేసు లకు గాను
*20,58,227 మంది డిశ్చార్జ్ కాగా
*14,492 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,073#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/rF8CTGp7Vr
— ArogyaAndhra (@ArogyaAndhra) December 28, 2021
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)