ఉత్కంఠభరితంగా సాగిన తిరుపతి డిప్యూటీ మేయర్ పదవి ఎన్నికల్లో కూటమి నేతలు విజయం సాధించారు. డిప్యూటీ మేయర్ గా అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. తమను కొట్టి బెదిరించారంటూ నలుగురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మాజీ మంత్రి, భూమన కరుణాకర్రెడ్డి కాళ్ల మీద పడి క్షమాపణలు కోరారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం భూమన కరుణాకర్రెడ్డి నివాసానికి టీడీపీకి ఓటేసిన నలుగురు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు వచ్చారు. బెదిరించి కూటమికి ఓట్లు వేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు అయిందంటూ భూమన కాళ్లమీద పడి క్షమాపణ కోరారు. కూటమి నేతలు తమను కొట్టి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అనీష్, మోహన్ యాదవ్, అనిల్, అమర్నాథ్ రెడ్డి అనే కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారంటూ వారిని మీడియా ముందు ప్రవేశపెట్టిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన.
గతి లేక టీడీపీకి ఓటేశామంటూ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కాళ్ళు పట్టుకొని ఏడ్చిన వైసీపి కార్పొరేటర్లు
తిరుపతి...
గతి లేక టిడిపికి ఓటేసాము అని చెప్పిన వైసీపి కార్పొరేటర్లు
నిన్న కిడ్నాప్ అయిన కార్పోరేటర్లు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలలో టిడిపికి ఓటు వేసి తర్వాత మాజీ ఎమ్మెల్యే ఇంటికి చేరుకుని మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు అందువలన టిడిపి మునికృష్ణాకి ఓటు వేశాం అంటూ… pic.twitter.com/93EzLHDWxA
— Aadhan Telugu (@AadhanTelugu) February 4, 2025
గతి లేక టీడీపీకి ఓటేశామంటూ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కాళ్ళు పట్టుకొని ఏడ్చిన వైసీపి కార్పొరేటర్లు
నిన్న కిడ్నాప్ అయిన కార్పోరేటర్లు తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలలో టీడీపీకి ఓటు వేసిన తర్వాత మాజీ ఎమ్మెల్యే భూమన ఇంటికి చేరుకుని మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు అందువల్ల… pic.twitter.com/BuHjAlvV8A
— Telugu Scribe (@TeluguScribe) February 4, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)