అనంతపురం జిల్లాలో పరువు హత్య జరిగింది(Andhra Pradesh). కూతురిని ఉరేసి చంపి పెట్రోల్ పోసి నిప్పంటించారు తండ్రి. వేరే కులానికి చెందిన యువకుడిని ప్రేమించిందని కూతురిని చంపేశారు తండ్రి.

అనంతపురం జిల్లా గుంతకల్లుకు చెందిన రామాంజనేయులుకు నలుగురు కూతుళ్ళు ఉన్నారు. (Father Kills Daughter). డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న చిన్న కూతురు భారతి (21) హైదారాబాద్లొ డిగ్రీ చదువుతున్న యువకుడిని ప్రేమించింది.

ఇంజక్షన్ వికటించి 7 నెలల గర్భిణి మృతి.. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆస్పత్రిలో ఘటన, మృతురాలి బంధువుల ఆందోళన 

అతను వేరే కులానికి చెందిన వాడని, మరిచిపోవాలని తండ్రి మందలించినా కూతురు వినలేదు. ఈ నెల ఒకటో తేదీన తన కూతురుని బండిపై ఎక్కించుకొని గుంతకల్లు మండలం కసాపురానికి తీసుకెళ్ళి మరొకసారి మందలించనా కూతురు వినలేదు. దీంతో బలవంతంగా చెట్టుకి ఉరి వేసి చనిపోయాక తన బండి నుండి పెట్రోల్ తీసి ఆమెపై పోసి నిప్పంటించాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)