Newyork, June 23: అమెరికాలో (America) శనివారం జరిగిన కాల్పుల ఘటనలో గాయపడ్డ తెలుగు యువకుడు దాసరి గోపీకృష్ణ (32) (Dasari Gopi Krishna) దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. అసలేం జరిగిందంటే.. బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం యాజలికి చెందిన దాసరి గోపీకృష్ణ.. 8 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ఆర్కాన్సాస్ లోని ఓ సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం గోపి విధుల్లో ఉండగా తుపాకితో వచ్చిన దుండగుడు అతడిపై కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన గోపీని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. గోపీకృష్ణకు భార్య, కుమారుడు ఉన్నాడు.
అమెరికాలో అగంతకులు జరిపిన కాల్పుల్లో బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ మృతి చెందారు.#USA #firingincident #Indian #deceased #RTV
— RTV (@RTVnewsnetwork) June 23, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)