తెలంగాణలో గడచిన 24 గంటల్లో 50,569 కరోనా పరీక్షలు నిర్వహించగా, 239 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 68 కొత్త కేసులు నమోదు కాగా, కరీంనగర్ జిల్లాలో 17, నల్గొండ జిల్లాలో 16, రంగారెడ్డి జిల్లాలో 16 కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్, నారాయణపేట జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.
అదే సమయంలో 336 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,64,650 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,55,961 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 4,778 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 3,911కి పెరిగింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.24.09.2021 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/VkgKnkFOAC
— IPRDepartment (@IPRTelangana) September 24, 2021
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)