తెలంగాణలో కరోనా వ్యాప్తిపై ప్రజారోగ్య శాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో రోజువారీ కేసుల సంఖ్య తగ్గిపోతుండడంతో యాక్టివ్ కేసుల సంఖ్యలోనూ తగ్గుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో 24,848 కరోనా పరీక్షలు నిర్వహించగా, 81 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాదులో 35 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 123 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,90,499 మంది కరోనా బారినపడగా, వారిలో 7,85,565 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 823 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనా ప్రభావంతో 4,111 మంది మరణించారు.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.15.03.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/gjPykK58aN
— IPRDepartment (@IPRTelangana) March 15, 2022
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)